గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. తిరిగి జూన్ 11న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటన తో మనస్థాపానికి గురైన 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది.

సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను TSPSC రద్దు చేయడం తో మనస్థాపానికి గురయ్యాడు. ఉద్యోగం లేదని, అన్ని ఉద్యోగాలకు కూడా అనర్హుడుని అవుతున్నానని మనస్తపంతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని నవీన్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తనకు గ్రూప్–1 పరీక్ష రద్దు కావడంతో ‌నిరాశ కలిగిందని..ఇక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని.. జీవితం‌పై విరక్తి వచ్చిందని సూసైడ్ లెటర్ లో రాసుకొచ్చాడు. ఉరి వేసుకున్న నవీన్ వద్ద లభ్యమైన నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క గ్రూప్ -1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులు నిరసన ప్రిలిమ్స్ రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న తమకు టీఎస్పీఎస్సీ (TSPSC) అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు.