లడఖ్‌లో కొత్త కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు

లడఖ్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా నిర్ణయాలు

pm modi

న్యూఢిల్లీ: లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి ఆ ప్రాంతంలో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో ఓ బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కూడా మోడి ఓకే చెప్పారు. ఈ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మెడిసిన్ మినహా మిగతా అన్ని బేసిక్ సైన్సెస్ తదితర కోర్సుల్లో డిగ్రీలను అందిస్తుంది. ఇక ఈ వర్శిటీ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ త్వరలోనే అఫీషియల్ గా ప్రపోజల్ తెస్తుందని, ఆపై క్యాబినెట్ ఆమోదం తరువాత బిల్లు పార్లమెంట్ మందుకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, లడఖ్ ప్రాంతంలో గడచిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రధాని, ఈ సమావేశంలోనే కొత్త వర్శిటీపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/