యువతిపై తాత, మేనమామ అత్యాచారం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
హైదరాబాద్: సమాజం సైతం తలదించుకునే దారుణ ఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. హైదరాబాద్లో 19 ఏళ్ల యువతిపై తన తాత, మేనమామ అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడ మహ్మద్ నగర్కు చెందిన షేక్ అఫ్సర్కు 70 ఏళ్లు. ఆయప మనుమరాలుకు 19 ఏళ్లు. చిన్నతనం నుంచే తాతగారి ఇంట్లోనే పెరిగింది. సదరు బాలికపై కన్నేసిన తాతయ్య షేక్ అఫ్సర్ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్ సిద్దిఖ్ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె ఈ నెల 1న చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/