పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంపు

అంతర్జాతీయ మార్కెట్ లో పతనమైన చమురు ధరలు

petrol-and-diesel
exise-tax-increased-on-petrol-and-desiel

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. పెట్రోలు, డీజిల్ పై లీటరుకు మూడు రూపాయలు సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. కరోనా ప్రభావం, ఓపెక్ దేశాలైన సౌదీ అరేబియా, రష్యాల మధ్య వివాదం, అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం తదితర కారణాలతో ఇటీవల కాలంలో క్రూడాయిల్ ధరలు సగానికి తగ్గిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 35 డాలర్లకు అటూఇటూ పలుకుతోంది. దీంతో ఈ విధంగా దేశీయ మార్కెట్ నుంచి ఆదాఅవుతున్న మొత్తాన్ని సాధారణంగా వినియోగదారులకు ప్రభుత్వాలు బదలాయించాలి. కానీ భారీమొత్తం ఆదా అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఆ లాభాలను ప్రభుత్వ ఖాతాకు జమచేసుకునే ఎత్తుగడలో భాగమే ఇది. ఎక్సైజ్ సుంకాన్ని పెంచితే సాధారణంగా దేశీయంగా పెట్రోధరలు పెరగాలి, కానీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నందున ఇక్కడ తగ్గే అవకాశం లేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/