ఇకపై ఆధార్ ఓటర్ ఐడీ అనుసంధానం
న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పాన్కార్డ్, బ్యాంకు ఖాతాలను ఇప్పటికే ఆధార్కార్డుతో అనుసంధానం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఓటర్కార్డును కూడా ఆధార్తో లింక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు వీలుగా కేబినెట్ నోట్ను రూపొందిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో దీనిని మంత్రి మండలి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆధార్ఓటర్కార్డు అనుసంధానం మొదలైతే ఇప్పటికే ఓటర్ కార్డు కలిగిన వారు ఆధార్ నంబరును సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా ఆధార్ వివరాలను అడిగేందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు (ఈఆర్వో) అధికారం వస్తుంది. అయితే, ఆ వివరాలు ఇవ్వనప్పటికీ కొత్త కార్డును తిరస్కరించడం కానీ, పాత కార్డును తొలగించే హక్కు కానీ ఈఆర్వోలకు ఉండదు. ఈ విధానం అమల్లోకి వస్తే బోగస్ కార్డులను ఏరివేసే వీలు చిక్కుతుందని ఈసీ అభిప్రాయపడింది.
తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/