కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలి
న్యూఢిల్లీ: దేశాన్ని మందగమనం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కేంద్రం వెంటనే మరిన్ని చర్యలు చేపట్టాలని ఫిక్కీ జాతీయ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి అన్నారు. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏడాది క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదన్నారు. మూలధన సమీకరణ క్షీణించిందని, వినియోగం తగ్గిందన్నారు. మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు అవసరమన్నారు. వినియోగాన్ని పెంపొందించేందుకు ఆర్థిక వ్యవస్థలోకి రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు నిధులు తక్షణం తీసుకు రావాలన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/