అంతర్జాతీయ ప్రయాణికులకు ‘ఎయిర్ సువిధ’ నిబంధన ఎత్తివేత
తాజా నిర్ణయం గత అర్ధరాత్రి నుంచి అమలు
న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్ గుడ్న్యూస్ చెప్పింది. కొవిడ్ నేపథ్యంలో ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరంలేదు. ఈ ఆంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
కొవిడ్-19 సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగానూ, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించి, కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసు విడుదలైంది. ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది. అయితే, కరోనా కేసులు ఎక్కువైతే ఈ నిబంధన మళ్లీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/