నేడు వరంగల్ లో పర్యటించనున్న గవర్నర్ తమిళి సై

గవర్నర్ తమిళి సై నేడు వరంగల్ లో పర్యటించబోతున్నారు. మహాశివరాత్రి సందర్బంగా హన్మకొండలోని ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ వేడుకల్లో గవర్నర్ తో పాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు.

అలాగే మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరారు.

ట్రాఫిక్ రూల్స్ :

  • హనుమకొండ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు శ్రీదేవి ఏషియన్మాల్, అంబేడ్కర్ సెంటర్, సీపీవో పాయింట్ నుంచి కేయూసీ మీదుగా వెళ్లాలి
  • హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, తొర్రూరు, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలి
  • ములుగు, పరకాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, సీపీవో నుంచి అంబేడ్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్ కు చేరుకోవాలి
  • ములుగు క్రాస్ రోడ్డు నుంచి హనుమకొండకు.. అలంకార్, కాపువాడ మీదుగా వెళ్లాలి
  • హనుమకొండ నుంచి వరంగల్ వైపునకు.. మార్కజీ పాఠశాల, కొత్తూర్ జెండా మీదుగా పెద్దమ్మగడ్డ ద్వారా చేరుకోవాలి
  • వరంగల్ బస్టాండ్ నుంచి పోస్టాఫీస్, శివనగర్, పోతనరోడ్డు, సంతోషిమాత దేవాలయం, సీఎస్ఆర్ గార్డెన్, అదాలత్ నుంచి హనుమకొండ, ఇతర ప్రాంతాలకు వెళ్లాలి.