సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదుః గవర్నర్​ తమిళిసై

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌ః గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్​లోని అంబేడ్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. జీవితం అనేది అంత సులభం కాదని.. సవాళ్లు లేకుండా ఎవరి జీవితం సాగదనిపేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అదే సమయంలో అందరూ కరోనా వాక్సిన్​ వేయించుకోవాలని, యోగా చేయాలని.. మంచి ఆహారం తీసుకోవాలని గవర్నర్​ తమిళిసై సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/