ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి

రూ. 45,000 కోట్ల నిధులు విడుదల చేయాలని రిజర్వు బ్యాంకును కోరిన కేంద్రం

Reserve Bank of India
Reserve Bank of India

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంతో నలిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం మరోసారి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ను ఆశ్రయిస్తుంది. అంతకంతకూ పడిపోతున్న రాబడులు, పన్ను వసూళ్లతో ఏం చేయాలో అంతుబట్టని కేంద్రం ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే రిజర్వు బ్యాంకు ఒక్కటే దిక్కు అని గుర్తించింది. అందుకే రూ.45,000 కోట్ల నిధులు విడుదల చేయాలనీ ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తోంది. సమయానికి చెల్లింపులు చేయాలంటే కేంద్రానికి మరో మార్గం కనిపించడం లేదు. అందుకే ఈ మొత్తం నిధులను మధ్యంతర డెవిడెండ్‌ రూపంలో వెంటనే చెల్లించాలని కోరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో డెవిడెండ్‌తో పాటు పరిమితి కంటే అధికంగా ఉన్న నిధుల్లో వాటాను కూడా చెల్లించింది. ఇలా 1.48 లక్షల కోట్ల అదనపు నిధులతో కలుపుకొని మొత్తంగా రూ.1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. దీనివల్ల ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి శకునం కాదని చాలా మంది ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/