ఏజిఆర్ పూర్తి బకాయిలు చెల్లించండి
టెల్కోలను ఆదేశించిన కేంద్రం
న్యూఢిల్లీ: టెలికాం సంస్థలకు కేంద్రం ఏజిఆర్ బకాయిల చెల్లింపు విషయంలో మరోసారి ఆల్టిమేటం జారీ చేసింది. ఈ బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం టెలికాం సంస్థల నుంచి సుమారు రూ. 25,900 కోట్లను అందుకున్నట్లు తెలిపింది. అయితే త్వరలోనే పూర్తి చెల్లింపులు చేయాలని టెల్కోలను ఆదేశించినట్లు కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే పార్లమెంట్కు అందించిన సమాచారంలో వెల్లడించారు. పూర్తి చెల్లింపులు చేయాలని రాసిన లేఖలో ఆదేశించామన్నారు. అలాగే టెలికాం రంగంలో గుత్తాధిపత్యం. కార్టలైజేషన్ ను నివారించేందుకు కొత్త యాంట్రీ ట్రస్ట్ లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలనలో లేవని కూడా వెల్లడించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/