మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తుంది

Minister Talasani Srinivas

వికారాబాద్‌: పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గొట్టిముక్కుల గ్రామంలోని సర్పన్పల్లి ప్రాజెక్ట్ లో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. చెరువులు, ప్రాజెక్ట్ ల్లో ఉచితంగా నాణ్యమైన చేప పిల్లలు వదులుతున్నామని తెలిపారు. ముదిరాజ్, మృత్సకారులు ఆర్థికంగా లాభాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, విద్యా, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లు మోతీలాల్, చంద్రయ్య పాల్గొన్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/