శృతి ని ఐలవ్ యూ అనడం ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని

క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని..తాజాగా బాలకృష్ణ తో చేసిన వీర సింహ రెడ్డి మూవీ తో మరో హిట్ కొట్టాడు. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ లో గోపి పేరు తెగ చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటె వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకలో శృతి ని గోపి ఐలవ్ యూ అనడం ఫై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దీంతో ఆ మాట అనడం ఫై క్లారిటీ ఇచ్చారు.

శృతిహాసన్ తో ఇది నా మూడవ సినిమా. బలుపు , క్రాక్, ఇప్పుడు ‘వీర సింహారెడ్డి’ చిత్రాలు చేశాను. తను నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. తను నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మా మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ వుంది. తను నా వైఫ్ తోనూ బాగా క్లోజ్ గా వుంటుంది. నా కొడుకు సాత్విక్ అంటే తనకు చాలా ఇష్టం. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తన కోసం చాక్లెట్స్ తీసుకొస్తూ వుంటుంది. అలా మా మధ్య మంచి అనుబంధం వుంది కాబట్టే తను స్టేజ్ పై తనని అన్నయ్య అంటూ సంబోధించిందని అలా మాట్లాడింది కాబట్టే నేను తనకు ఐ లవ్ యూ చెప్పానని దాన్ని తీసుకుని సోషల్ మీడియాలో అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ అన్నట్టుగా ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆ వార్తలు చూసి నవ్వుకున్నానని వెల్లడించాడు.