అమెరికన్లకు ఉద్యోగ శిక్షణ : గూగుల్

వాషింగ్టన్: ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమయ్యేలా సుమారు 2.50 లక్షల మంది అమెరికన్ పౌరులకు శిక్షణను ఇవ్వనున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. డల్లాస్ లోని ఎల్ సెరంట్రో కమ్యూనిటీ కళాశాలలో, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్తో కలిసి ఆయన ఒక సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో 2.50 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే తమ లక్ష్యమని పిచాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికాకు ప్రాధానత్యనిచ్చే సంస్థల్లో గూగుల్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. అమెరికన్ పౌరులకు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగ నైపుణ్య శిక్షణనిచ్చే పథకాన్ని 2018 జూలైలో ట్రంప్ ప్రారంభించారు. ఇప్పటికే గూగుల్ గ్రో విత్ గూగుల్ పేరిట జాతీయ నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ.. వివిధ ఆన్లైన్ నైపుణ్యాలను ఉచితంగా నేర్పిస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/