పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగానే ఉన్నాం

కాబట్టే కాళేశ్వరం పూర్తయిందని చెప్పిన కెటిఆర్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాలతో సఖ్యత కలిగి ఉన్నందువల్లే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపి సిఎం జగన్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. అంతేందుకు చంద్రబాబు హయాంలో కూడా ఏపితో మంచి సంబంధాలను కోనసాగాయని ఆయన గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ…. ఉమ్మడి ప్రాజెక్టును పక్కన పెట్టలేదని, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు రెండు రాష్ట్రాల సిఎంలు ఇంకా ప్రకటించలేదని చెప్పారు. సిఎం పదవిపై కెటిఆర్‌ను ప్రశ్నించగా., సమాధానంగా కెసిఆరే తమ సిఎం అని, ఈ విషయంపై అసెంబ్లీలో స్వయంగా కెసిఆర్‌ స్పష్టత ఇచ్చారని అన్నారు. ఇంకా దీనిపై అనుమానం ఎందుకు అని ప్రశ్నించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/