మెట్రో ప్రయాణికులకు శుభవార్త

ఛార్జీల్లో 40 శాతం రాయితీలు ప్రకటించిన మెట్రో

hyderabad metro rail
hyderabad metro rail

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌యాణికుల‌కు ఛార్జీల్లో రాయితీలు ప్ర‌క‌టించింది. మెట్రో సువ‌ర్ణ ఆఫ‌ర్ కింద ప్ర‌యాణాల్లో 40 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌టించారు. రేప‌ట్నుంచి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మెట్రో ఛార్జీల్లో రాయితీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.
వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌గ‌రంలో రోడ్లు దెబ్బ‌తిన్నాయి అని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. వ‌ర‌ద రోజున ఒక గ‌ర్భిణీ కోసం ప్ర‌త్యేకంగా ఒక మెట్రో రైలును న‌డిపామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రోడ్ల మీద ప్ర‌యాణం క‌ష్టంగా మారింద‌న్నారు. ఈ క్ర‌మంలో మెట్రో ప్ర‌యాణాల‌ను ప్రోత్సహించాల‌ని భావించామ‌ని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.  

రాయితీల వివరాలు..

•14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం.

•20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం.
•40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం.
•7 ట్రిప్పుల‌కు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/