పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించింది. జీఎస్టీఆర్-9 (వార్షిక రిటర్న్), జీఎస్టీఆర్-9సీ (రీకన్సిలేషన్ స్టేట్మెంట్) సమర్పణకు గడువు పొడిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫామ్స్ను సబ్మిట్ చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గడువును 2020 మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేసింది. కేంద్రం అలాగే కాకుండా ఈ ఫామ్స్లో పలు కాలమ్స్ను ఆప్షనల్గా కూడా మార్చేసింది. దీంతో సింపుల్గానే రిటర్న్స్ను దాఖలు చేయవచ్చు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా రిటర్న్స్ దాఖలు సరళతరం చేశాం, గడువు పొడిగింపు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అయితే గడువు పలు మార్లు పొడిగించుకుంటూ వెలితే వ్యాపారాలపై ప్రభావం పడొచ్చు అని క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/