కరాచీలో గో ఎయిర్ విమానం అత్యవసర ల్యాండింగ్
విమానంలో ప్రయాణీస్తున్న ఒకరికి గుండె పోటు
New Delhi: భారత విమానం కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. రియాద్ నుంచి ఢిల్లీ వస్తున్న గో ఎయిర్ విమానం కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
రియాద్ లోని ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం మార్గ మధ్యలో ఉండగా విమానంలో ప్రయాణీస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో దారి మఃళ్లించి కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
అయితే విమానం ల్యాండ్ అయ్యేలోగానే సదరు ప్రయాణీకులు మరణించాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/