‘గ్రేటర్’ పరిధిలో గృహ యజమానులకు శుభ ‘వార్త’

ఆస్తిపన్నులో 50% రాయితీ

TS Minister KTR
TS Minister KTR

Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలో గృహ యజమానులకు 50శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.  15 వేల లోపు ఆస్తిపన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ వర్తిస్తుంది.

ఈ నిర్ణయం వల్ల 31 లక్షల 40 వేల మందికి రూ.336.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 పట్టణాల్లోనూ ఆస్తిపన్నులో రాయితీ కల్పిస్తాన్నట్లు మంత్రి  కేటీఆర్ తెలిపారు.

ఇతర పట్టణాల్లో రూ.10వేల లోపు ఆస్తిపన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/