జర్మనీలో షరతులతో లాక్‌డౌన్‌ : జర్మనీ చాన్సలర్‌

బెర్లిన్‌ : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. షరతులతో కూడిన లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఓలాఫ్‌ స్కోల్జ్‌ ప్రకటించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వ్యాక్తులను సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలు, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సినిమాహాళ్లతో పాటు పలు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.

అలాగే టీకా తీసుకొని వారు బయట తిరగడాన్ని నిషేధించారు. టీకా తీసుకున్న వారికి మాత్రం మినహాయింపును ఇచ్చారు. ఇదిలా ఉండగా కొవిడ్‌ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన చర్యలను జర్మన్‌ ఉన్నత న్యాయస్థానం సమర్పించిన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసింది. జర్మనీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/