నేడు గీతా జయంతి
పండుగ సందర్భం
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగ ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవాసుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి.
సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేద, వేదంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా ‘గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని ‘గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. కర్తవ్వ విమూడుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపం చడం అనేది లక్ష్యం అని సందర్భానుసారంగా
అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్ని స్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అర్జునికి గూఢమైన, వేరెవరికి తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/