గాయత్రీ దేవి

ఆధ్యాత్మికం

Gayatri Maata
Gayatri Maata

నిరంతర గాయత్రీ ఉపాసకుడైన గౌరీపతి. వృద్ధాప్యంలో మరణించాడు.. దేవా దూతలు అతన్ని మణి ద్వీపం చేర్చి అమ్మవారి చెంత వదిలి వెళ్లారు.. తేజస్సుతో వెలిగిపోతున్న మాటను చూసి పులకించి పోయాడు గౌరీ పతి. అంతలో అదే దేవ దూతలు అతనికి బాగా తెలిసిన సింహాచలాన్ని తీసుకొచ్చారు.. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు గౌరీపతి ..

‘అమ్మా.. నాదొక సందేహం’.. వినమ్రంగా అన్నాడు.. ఏమిటన్నట్టు చూసింది మాత .. నా చిన్నప్పటి నుంచి నీ మంత్రో పాసనే శ్వాసగా జీవిస్తున్నాను… నీ పూజలు తప్ప నాకు మరేమీ తెలియదు.. జీవన పర్యంతం నీ సేవలో గడిపాను.. ఇంట కష్టపడితే నీ పేరు తలవని పరమ నాస్తికుడైన సింహాచలం నీ , సన్నిధికి ఎలా రాగలిగాడు? అడిగాడు గౌరీ పతి.

గాయత్రీ దేవి ప్రశాంతంగా నవ్వి. ‘ ఆటను నాస్తికుడే.. కానీ నా కోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు’ అంది . గౌరీ పతి కి అర్ధం కాలేదు.. సింహాచలం నాకు పూజలు చేయకుంటేనేం? అతను నిర్వర్తించింది నా సేవే .. ఎప్పుడూ పరుల సౌఖ్యం గురించి ఆలోచించాడు.. మొక్కలు నాటుతూ మైళ్ళ కొద్దీ భూమిని పచ్చదనంతో నింపాడు.. పశు పక్ష్యాదులు ఆశ్రయం కల్పించాడు.. ఆటను వెలిగించిన ఆ ఆకు పచ్చ దీపాలతో నేనెంతో సంతోషించాను’ అంది.. గౌరీ పతి మాట కరమై చెమర్చిన కళ్లతో నమస్కరించాడు.

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/