ప్రయాణానికి ఈ-పాస్ తప్పనిసరి

ఇతర రాష్ట్రాల నుండి ఏపికి రావాలంటే ఆంక్షలు..గౌతమ్ సవాంగ్

Gautam Sawang
Gautam Sawang

అమరావతి: కేంద్రం రాష్ట్రాల మధ్య రాకపోకలపై సడలింపులను ప్రకటించినప్పటికీ, ఏపిలోకి ఇతర రాష్ట్రాల నుండి రావాలంటే ప్రస్తుతానికి ఈపాస్ తప్పనిసరని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకూ నిబంధనలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపి పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరని, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో వారు ఉండాలని వెల్లడించిన ఆయన, పరీక్షల్లో నెగటివ్ వస్తే, వారం రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, పాజిటివ్ వస్తే, ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ఇక కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు వారం రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకూ సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని గౌతమ్ సవాంగ్ కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/