కన్నా లక్ష్మీనారాయణ ను కలిసిన గంటా శ్రీనివాస్ రావు

టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు ..కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ అయ్యారు. గుంటూరులోని ఆయన నివాసంలో గంటా కలిశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని చెప్పిన వైస్సార్సీపీ నేతలు ఎక్కడికెళ్లారని హేళన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ రాజధానికి రెఫరెండం అని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా వెళ్లారని వెల్లడించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడినా వైస్సార్సీపీ ఓటమిపాలు అయిందని తెలిపారు. వైస్సార్సీపీ నేతలు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ లొంగకుండా ప్రజలు కచ్చితమైన తీర్పును ఇచ్చారని తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని… పొత్తులకు తొందర లేదని గంటా చెప్పారు. ఎన్నికల ముందే పొత్తులు, సీట్ల పంపకాలపై నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కన్నా లక్ష్మీణారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు.
RE