మెక్సికోలో దుండగుల కాల్పులు.. మేయర్‌ సహా 21 మంది హతం

మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగుల కాల్పులు

gangsters-shot-and-killed-21-people-at-mexico

మెక్సికోః దక్షిణ మెక్సికోలో ఓ గ్యాంగ్‌స్టర్స్‌ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేయర్, చట్టసభ్యురాలు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. శాన్ మిగేల్ టోటోలాపన్‌ పట్టణంలో మేయర్ కొన్రాడో మెనండోజా అల్మెడా అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్, మాజీ మేయర్ అయిన ఆయన తండ్రి సహా 20 మంది మృతి చెందారు. ఘటన అనంతరం నిందితుల కోసం ఆర్మీ, నేవీ రంగంలోకి దిగింది.

2015-17 మధ్య గెరెరోను నాశనం చేసిన లాస్ టెక్విలెరోస్ క్రిమినల్ గ్యాంగుపై ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ నాయకుడు రెబెలో జాకోబో డి అల్మోంటో హతమయ్యే వరకు ఈ ప్రాంతంలో మేయర్‌లను ఈ గ్యాంగు బెదిరిస్తూ ఉండేది. మేయర్ అల్మెడాకు చెందిన పార్టీ పార్టిడో డి లా రెవెల్యూసియన్ డెమొక్రిటికా (పీఆర్‌డీ) ఈ ఘటనను ఖండించింది. కాగా, మోరెలోస్ రాష్ట్రంలోని క్యుర్నవాకాలో జరిగిన మరో ఘటనలో చట్టసభ్యురాలు గాబ్రియెలా మరీన్‌ ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చి చంపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/