నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌

Nayeem (File)
Nayeem

హైదరాబాద్‌: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక విషయం వెల్లడైంది. నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ 25 మంది అధికారులపై బెదిరింపులు, ల్యాండ్ సెటిల్మెంటుల ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వీరందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వరకు ఉన్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు బదులుగా సిట్ చీఫ్ నాగిరెడ్డి ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు నయీం కేసులో 175కి పైగా ఛార్జిషీట్లు ఉన్నాయి. 130కి పైగా కేసుల్లో ఎనిమిది మంది రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/