విజయవాడ లో దారుణం : మైనర్ బాలిక ఫై గ్యాంగ్ రేప్

ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక ఫై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. సదరు బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

బెంజి సర్కిల్ కుచెందిన సాయి బాధిత బాలిక(14)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత మరోమారు బాలికను భవనంలోకి తీసుకెళ్లాడు. ఈసారి తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. గత కొన్ని రోజులుగా బాలిక శరీరాకృతిలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.