మహారాష్ట్రలో దారుణం : బాలిక ఫై 33 మంది అత్యాచారం

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తాజా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఫై ఒకరిద్దరు కాదు ఏకంగా 33 మంది అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మహారాష్ట్రలో ఠానేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

15 ఏళ్ల మైనర్​.. మంపాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముంటోంది. ఆమెకు ఓ యువకుడితో సంబంధం ఉంది. ఓ సందర్భంలో మైనర్​ను ఆ యువకుడు అసభ్యకరంగా వీడియోలు తీశాడు. ఈ ఘటన జనవరి 22న జరిగింది. అనంతరం వీడియోలను అడ్డుపెట్టుకుని అప్పటి నుంచి 33 మంది.. దోబివల్లి, బద్లాపుర్​, ముర్బాద్​, రాబెల్​ ప్రాంతాల్లో చిత్రహింసలు పెట్టి తొమ్మిది నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. మరోపక్క నిందితులపై పోక్సో సహా అత్యాచారం, బ్లాక్ మెయిల్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఎన్‌సీపీ, ఆర్పీఐ పార్టీ కార్యకర్తలు మన్‌పడా పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.