కడపలో దారుణం..8 వ తరగతి విద్యార్థిని ఫై గ్యాంగ్ రేప్

ఏపీలో కామాంధులు రెచ్చిపోతున్నారు. పెద్ద చిన్న అనే తేడాలు లేకుండా ఒంటరి మహిళా కనిపించిన, అభం శుభం తెలియని చిన్నారి కనిపించిన వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా కడప లో దారుణం చోటుచేసుకుంది. 8 వ తరగతి విద్యార్థిని ఫై గ్యాంగ్ రేప్ చేసారు.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని గోపవరం మండలం రాచాయపేటలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా బాలికను నగ్నంగా వీడియో చిత్రీకరిస్తూ పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. అయితే.. అత్యాచారానికి పాల్పడింది టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు.