ఢిల్లీ రైల్వే స్టేషన్లో దారుణం : 30 ఏళ్ల మహిళఫై గ్యాంగ్ రేప్
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో 30 ఏళ్ల మహిళ ఫై గ్యాంగ్ రేప్ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైల్వే స్టేషన్లోని 8-9 ఫ్లాట్ఫామ్లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్టేనెన్స్ రూమ్లో 30 ఏళ్ల మహిళ ఫై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహింగా అత్యాచారం చేసారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. నిందితులు నలుగురు కూడా రైల్వే ఉద్యోగులే ..వాళ్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ నలుగుర్నీ అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు.
గతంలో కూడా ఢిల్లీ లో ఎన్నో అత్యాచార ఘటన చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నిర్బయ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని అంత అనుకున్నారు. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కోర్ట్ లు , పోలీసులు ఎంతటి కఠిన శిక్షలు విధిస్తున్న , ఎంత పటిష్టంగా బందోబస్తు చేస్తున్నప్పటికీ కామాంధుల చేతుల్లో అమాయకపు మహిళలు బలి అవుతూనే ఉన్నారు. మహిళలనే కాదు అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు.