నేడే హుస్సేన్ సాగర్ నిమజ్జనం ఫై సుప్రీం కోర్ట్ తీర్పు

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్‌లో గణేష్ నిమజ్జనం అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. గత కొన్ని ఏళ్లుగా గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పీవోపీ వినాయక విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయొద్దని, దగ్గరలోని చెరువులలో , కుంటలలో నిమజ్జనం చేయాలనీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఈ అంశం ఫై సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నప్పటికీ , ఒకవేళ రాకపోతే ఎలా అనే ప్రశ్నలు ఇబ్బంది గా మారాయి. గ్రేటర్​లో నిర్మించిన 25 నీటి కొలనులకు కూడా జీహెచ్ఎంసీ మరమ్మతులు పూర్తి చేసి నిమజ్జనానికి సిద్ధం చేస్తోంది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ప్రకటిస్తుందో వేచి చూడాలి.