హైదరాబాద్ లో 2 వారాలు పూర్తి లాక్ డౌన్ !
ప్రభుత్వం యోచన
Hyderabad: హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రెండు వారాలు పూర్తి లాక్ డౌన్ విధించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది.
ఈ మేరకు ఇప్పటికే కేసుఆర్ ఆధికారులతో చర్చించినట్లు ప్రబుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అధికారులు కూడా కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని పేర్కొనడంతో ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ విషయంపై రానున్న మూడు నాలుగు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/