నేడు పెట్రోలుపై లీటరుకు 47 పైసల పెంపు
డీజిల్పై లీటరుకు 93 పైసలు పెరుగుదల

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 47 పైసలు, డీజిల్పై లీటరుకు 93 పైసలు పెరిగాయి. పది రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.5.47, డీజిల్ ధర రూ.5.80 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.76.73కి, డీజిల్ ధర రూ.75.19కి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.83.62కి, డీజిల్ 73.75కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.80.37, డీజిల్ ధర రూ.73.17గా ఉంది. కోల్కతాలో లీటరు పెట్రోలు రూ.78.55, డీజిల్ ధర రూ.70.84గా ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/