మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. నేడు కూడా లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లేటెస్ట్ పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21, డీజిల్ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94, డీజిల్ ధర రూ. 96, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/