హైదరాబాద్ లోని చందానగర్ లో విషాదం ..
హైదరాబాద్ లోని చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లోని ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లల ఆత్మహత్య చేసుకున్నారు. గత శుక్రవారం నుండి తలుపు వేసివున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం ఉదయం ఇంట్లో నుండి దుర్వాసన రావడం, ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగిలులగొట్టి తెరిచారు స్థానికులు.
ఇంట్లో భర్త నాగరాజు , భార్య సుజాత పిల్లలు రమ్యశ్రీ, టిల్లు మొత్తం నలుగురు చనిపోవడం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. గత ఏడూ సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న మృతులు..కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాకు కారణంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.