ఏపీలో విషాదం : కరెంట్ షాక్తో 4 ఏనుగులు మృతి
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందిన ఘటన పార్వతీపురం జిల్లా భామిని (మ) కాట్రగడ సమీపంలో జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం కావడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
అయితే ఒడిశా నుంచి 6 ఏనుగులు వచ్చాయని అందులో 4 ప్రమాదంలో చనిపోయినట్లు అంటున్నారు. మిగిలిన ఏనుగులు తివ్వాకొండవైపు వెళ్లినట్లు స్ధానికులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఇదే పరిస్థితి కొనసాగితే మరింత ప్రమాదకరమని స్ధానికులు ఆందోళన చెందుతున్నారు.