పాక్లో హిందూ దేవతల ఆలయ నిర్మాణం
నేడు ఇస్లామాబాద్లో శ్రీకృష్ణ మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో తొలిసారి హిందూ దేవతల ఆలయాన్ని నిర్మించనున్నారు. రాజధానిలోని హెచ్9 ప్రాంతంలో సుమారు 20 వేల చదరపు గజాల స్థలంలో శ్రీ కృష్ణ మందిర్ ఆలయ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేశారు. పది కోట్ల ఖర్చుతో ఈ ఆలయ నిర్మాణం సాగనున్నది. పాక్ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇస్లామాబాద్లో 1947కు ముందు కట్టిన అనేక హిందూ ఆలయాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆ పురాతన ఆలయాలను ప్రస్తుతం వాడడం లేదన్నారు. ఆలయ నిర్మాణం కోసం కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల శాఖా మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి తెలిపారు. ప్రస్తుతం పది కోట్ల టార్గెట్తో ఆలయ నిర్మాణం మొదలుపెట్టామన్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుమతితోనే ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/