అమిత్షాకు మాజీ ఎంపి ఫిర్యాదు

హైదరాబాద్: బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షాను పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ ఈరోజు ఢీల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వివేక్ తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేత నిర్ణయంపై అమిత్షాకు వివేక్ ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందంటూ వివేక్ పేర్కొన్నారు. అయితే వివేక్ త్వరలోనే బిజెపిలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆయన అమిత్ షాను కలిశారని, వచ్చే నెలలో ఆయన బిజెపి లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/