రూ.2 వేల కోట్లు దొరికాయని దుష్ప్రచారం చేశారు
ఐటీ పంచనామా రిపోర్డుపై వైఎస్సార్సిపి నేతలు స్పందించాలి
అమరావతి: చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైఎస్సార్సిపి నేతలు దుష్ప్రచారం చేయడంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల ఐటీ దాడులని సొంత మీడియాలో బూతద్ధంలో చూపారని, రూ. 2లక్షల నగదుకు దొరికితే 2 వేల కోట్లని ప్రచారం చేసారని విమర్శించారు. 26 డొల్ల కంపెనీలు ఉన్నాయని వైఎస్సార్సిపి దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. ఐటీ శాఖ పంచనామా రిపోర్టుపై వైఎస్సార్సిపి నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసినందుకు వైఎస్సార్సిపి నేతలు టిడిపికి చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/