ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: సిఎం జగన్‌ శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..రైతులు కనీస గిట్టుబాటు ధర ఇబ్బందులు పడకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలని జగన్‌ అధికారులకు ఆదేశించారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకూడదని అన్నారు. సంబంధిత పంటల విషయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు.వచ్చే సీజన్‌కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రఖ్యాత కంపెనీలతో టై అప్‌ చేసుకోవాలని సీఎం వివరించారు. రైతు బరోసా కేంద్రాల స్థాయిలోనే ప్రాథమిక స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయాలని తెలిపారు. మండల, నియోజకవర్గ స్థాయిలో అంచనాలు రూపొందించాలని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/