ప్రజలే జగన్పై దాడి చేసే రోజులు రాబోతున్నాయి అంటూ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నోరు జారి విమర్శల పాలవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయబోయి జగన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జగన్ దాడి చేసేది ఏంటి.. ప్రజలే జగన్పై దాడి చేసే రోజులు రాబోతున్నాయన్నారు. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుధువారం నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భాంగా మీడియా తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేసారు. మహిళలపై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ తన ద్వారా నష్టపోయిన మహిళల గురించి ముందు మాట్లాడాలన్నారు. పవన్ కళ్యాణ్ కు మనసనేదేలేదు.. ఆయన మహిళలను ఏవిధంగా హింసించారో ప్రజలే చూస్తున్నారు. కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి వాడు ప్రజా నాయకుడు కాకూడదని రెండు చోట్ల ప్రజలే తిరుస్కరించారు అని నారాయణ స్వామి అన్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>మనసులో మాట..<br><br>వైసిపి లీడర్స్ లో జగన్ పై అసంతృప్తి,ఆగ్రహం..<br><br>ప్రజలే జగన్మోహన్రెడ్డిపై దాడి చేసే రోజు వస్తుందంటూ మనసులో మాట బయట పెట్టారు ఎపి వైసిపి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. <a href=”https://t.co/N9fO8fbTe0″>pic.twitter.com/N9fO8fbTe0</a></p>— Sreenivas C (@SreenivasC14) <a href=”https://twitter.com/SreenivasC14/status/1443060885832957958?ref_src=twsrc%5Etfw”>September 29, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>