తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి కొత్త విధ్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకోనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గు ముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జులై నెలాఖరు వరకు కరోనా తగ్గు ముఖం పడుతుందని.. స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/