జనాభా లెక్కల సేకరణను వాయిదా వేసిన కేంద్రం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మొదటివిడత జనాభా లెక్కల సేకరణను వాయిదావేసింది. కరోనా నేపథ్యంలో జనాభా లెక్కల సేకరణను వాయిదా వేసినట్లు హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ప్రకటించింది. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు పార్తాప్ సింగ్ బజ్వా అడిగిను ప్రశ్నకు సమాధానంగా జనాభా లెక్కల సేకరణ వాయిదాపడినట్లు తెలిపింది. దేశంలో ప్రతి పదేండ్లకొకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సిన మొదటి దశ జనగణన వాయిదా పడినట్లు హోం మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభకు తెలిపింది. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఇవి ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదని సంబంధిత అధికారులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/