భారత్‌లో నమోదైన తొలి కరోనా కేసు

కేరళ యువకుడికి సోకిందని నిర్ధారించిన వైద్యులు

Coronavirus in india
Coronavirus in india

తిరువనంతపురం: చైనాలో వ్యాపించి, ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. దీనిపై తొలి కేసు కేరళలో నమోదయ్యింది. చైనాలోని వుహాన్‌ విశ్వవిద్యాలయంలో చదువుతోన్న ఓ విద్యార్థి ఇటీవల కేరళకు వచ్చారు. అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు అందాల్సి ఉంది. ఇప్పటికే కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యక్తమవుతోన్న కొందరిని పలు రాష్ట్రాల్లో వైద్యులు పరీక్షిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/