భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మవోయిస్టులు మృతి
ఛత్తీస్గడ్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జిల్లాలోని చర్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
పెసర్లపాడు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు.. కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఆదివారం రాత్రి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/