29 మంది హిందువుల ఇండ్లకు నిప్పు

ఢాకా: బంగ్లాదేశ్‌లో 29 మంది హిందువుల ఇండ్లకు దుండగులు నిప్పంటించారు. మరో 66 ఇండ్లను ధ్వంసం చేశారు. బంగ్లాలో ఇటీవల దుర్గాపూజ రోజు, ఆ తర్వాత హిందూ ఆలయాలపై, హిందువులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రంగ్‌పూర్‌ జిల్లాలోని మజీపరాకు చెందిన ఓ హిందూ యువకుడు సోషల్‌ మీడియాలో దైవదూషణ చేశాడన్న వదంతులు వ్యాపించడంతో ఆదివారం రాత్రి అతని ఇంటిపై దుండగులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతని ఇంటికి రక్షణగా నిలువగా, దుండగులు సమీపంలోని 29 ఇండ్లకు నిప్పు పెట్టారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/