మ‌రోసారి పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ కింద మంట‌లు

ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌కు మంట‌లు..మంట‌ల‌ను అదుపు చేస్తోన్న అగ్నిమాప‌క‌ సిబ్బంది

హైదరాబాద్: హైద‌రాబాద్‌లో పంజాగుట్ట ఫ్లై ఓవ‌ర్ కింద మ‌రోసారి అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఫ్లై ఓవ‌ర్ పిల్ల‌ర్‌కు ఏర్పాటు చేసిన ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌కు మంట‌లు అంటుకోవ‌డంతో అక్క‌డ వాహ‌న‌రాక‌పోక‌లు కాసేపు నిలిచిపోయాయి. ఆ మార్గంలో ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది. వాహ‌న‌దారులు, స్థానికులు భ‌యాందోళ‌నల‌‌కు గుర‌య్యారు. ఈ ప్ర‌మాదంపై అగ్నిమాప‌క సిబ్బంది స‌మాచారం అందుకుని అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది.

కాగా, మూడు రోజుల క్రితమే పంజాగుట్ట‌ ఫ్లై ఓవ‌ర్ కింద ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లోనే మంట‌లు అంటుకుని క‌ల‌క‌లం చెల‌రేగింది. మ‌ళ్లీ అదే ప్రాంతంలో మంట‌లు అంటుకోవ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డ మంట‌లు చెల‌రేగుతోన్న ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/