సికింద్రాబాద్‌లోని బైక్ షోరూంలో అగ్నిప్రమాదం..తగలబడిన బైకులు

సికింద్రాబాద్‌లోని ఒక ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షోరూంలో ఉన్న బ్యాటరీలు పెద్ద శబ్దాలు చేస్తూ పేలుతుండటంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోపక్క షోరూం ఫై అంతస్థుకు సైతం మంటలు అంటుకున్నాయి.

దీంతో అంతస్థులో ఉన్న రూబీ లాడ్జ్ లోని టూరిస్ట్ లను , లాడ్జ్ లోకి దిగిన వారిని క్షేమంగా కిందకు తీసుకొస్తున్నారు. ఘటన విషయం తెలిసి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి , మంటలను అదుపు చేస్తున్నారు. చాలా ఎలక్ట్రిక్ బైకులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.