నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్ కిందనున్న ఓ షాప్ లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ షాప్ పక్కనున్నమరికొన్ని షాపులకు కూడా మంటలు అంటున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనా వేస్తామని, అనంతరం బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.