శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవంలో అపశృతి..

శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కృత్తిక దీపోత్సవం సందర్భంగా ముక్కంటి ఆలయంలో ఏర్పాటు చేసిన చొక్కాని ఉత్సవం చివరలో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భద్రతా ఉద్యోగిని చేతికి గాయాలయ్యాయి. మరొకామె శ్వాస ఆడక అస్వస్థతకు గురయ్యారు.. మరో ఉద్యోగిని చెయ్యి బెణికింది. ఈ సమయంలో నిప్పు రవ్వలు భక్తులపై పడటం,, ఓ ప్రణాళిక లేకుండా చొక్కాని మానును వెలిగించడం వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. రాహు కేతు మండపంపై పడిన నిప్పురవ్వలను భద్రతా సిబ్బంది ఆర్పివేశారు. ఆలయ సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

సాధారణంగా ఏటా పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ దీపోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయ పరిసరాల్లోనే దాదాపు ఒక 20 అడుగుల ఎత్తులో ఒక దీపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించారు. దీంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రతి ఏటా ఈ దీపోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరవుతూనే ఉంటారు. అయితే గత రెండేన్నరేళ్లుగా కరోనా కారణంగా భక్తులు దూరంగా ఉన్నారు. అందుకే ఈ సారి ఊహించని రీతలో భారీగానే భక్తులు వచ్చారు. దానిక తగ్గ ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహాకులు ఫెయిలయ్యారు. అందుకే భారీగా మంటలు ఎగిసిపడతాయని తెలిసినా.. భక్తులను కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. ఒక్కసారి మంటలు ఎగిసిపడడంతో.. భయపడ్డ భక్తులు భయపడి ఒక్కసారిగా పరుగు అందుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.